రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి
- March 10, 2017
భారతీయ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అబుదాబీలో జరిగింది. మృతురాలి పేరు స్మృతి జేమ్స్. అల్ వహ్దా బస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఆమెను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని త్రిశూర్ జిల్లాకి చెందినవారు. మృతురాలు తన తల్లిదండ్రులు జేమ్స్ మరియు శైలజలతో ఉంటున్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







