227 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్
- March 10, 2017
దుబాయ్ పోలీస్ 2016 సంవత్సరంలో మొత్తం 227 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పలు కేసుల్లో 'వాంటెడ్' లిస్ట్లో ఉన్న 13,000 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ (దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) మాట్లాడుతూ, 2015తో పోల్చితే 2016లో పెరుగుదల 13 శాతం ఉన్నట్లు చెప్పారు. నిందితులు, 5.1 బిలియన్ దిర్హామ్ల విలువైన ఫైనాన్షియల్ క్రైమ్స్కి పాల్పడ్డారని చెప్పారాయన. ఇంటర్పోల్ సహకారంతో అరెస్టయినవారు 1.3 బిలియన్ దిర్హామ్ల విలువైన నేరాలకు పాల్పడ్డారు. ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ని 178 మంది నిందితులకు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి అందిన వారెంట్స్ నేపథ్యంలో ఎగ్జిక్యూట్ చేయబడ్డ క్రైమ్స్ శాతం 97.1 శాతం ఉంది. ఇంటర్నేషనల్లీ వాంటెడ్ అరబ్ సస్పెక్ట్ అయిన ఓ వ్యక్తిని 89 ఫైనాన్స్ కేసులకు సంబంధించి ఎక్స్ట్రాడిక్ట్ చేయడం జరిగిందని దుబాయ్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పలు దేశాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు ఆ వ్యక్తి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







