సోలార్ పవర్ అపార్టు మెంట్లకు
- March 10, 2017
టెక్నాలజీని వినియోగించుకుంటూ సోలార్ విద్యుత్ను వినియోగించుకునేందుకు ప్రభుత్ం ప్రోత్సాహం అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 17 లక్షల విద్యుత్ కనెక్షన్లు వున్నాయి. రోజుకు 11.25 నుంచి 11.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. సోలార్ విద్యుత్తు వినియోగం పెరిగితే గణనీయంగా విద్యుత్ను ఆదా చేసే పరిస్థతి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వేరకు జిల్లాలో ఇటు గృహ వినియోగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా విరివిగా సోలార్ విద్యుత్తును వినియోగించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇళ్ళకు కూడా సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఇంటి రూప్టాప్కు 5 కిలో వాట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను రూ.85 వేలకు అందిస్తున్నారు. 5 హెచ్పి సోలార్ పంపుసెట్లు రూ.4.95 లక్షలు యూనిట్ ఖరీదులో అందిస్తున్నారు. ఇందులో రూ.55 వేలు లబ్ధిదారుడు భరించాల్సి వుంది. మిగిలింది ప్రభుత్వాలు సబ్సీడీగా అందిస్తాయి. అదే విధంగా 3 హెచ్పి సోలార్ యూనిట్ను రూ.3.20 లక్షలకు అందిస్తున్నారు. ఇందులో 11 శాతం సబ్సీడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సోలార్ పంపు సెట్ల వల్ల రాత్రి పూట విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







