ప్రధాని తీవ్ర విచారం జవాన్ల మృతిపై
- March 11, 2017
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 11 మంది సీఆర్పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోమంత్రి రాజ్నాథ్ సింగ్ను అక్కడికి పంపుతున్నట్టు ప్రకటించారు. ''సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించడం నన్ను కలచివేసింది. అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..'' అని ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. సుకుమాలో పరిస్థితిని సమీక్షించాలని రాజ్నాథ్ సింగ్ను కోరాననీ...
ఆయన బయల్దేరి అక్కడికి వెళుతున్నారని పేర్కొన్నారు. సుకుమా జిల్లాలోని గిరిజనులు ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలో భెజ్జి వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







