భారత ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు సంఖ్యను పెంచిన సౌదీ
- March 12, 2017
ముస్లింలు మక్కా వెళ్లడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్నే హజ్ యాత్ర అంటారు. ప్రతీ సంవత్సరం సౌదీ ప్రభుత్వం ఒక్కొ దేశం నుంచి ఈ హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను నిర్ణయిస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేశం నుంచి హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను సౌదీ ప్రభుత్వం పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా మార్చ్ 9 వరకు హజ్ యాత్రకు వెళ్లదలచుకున్నవారు దరఖాస్తులు చేసుకున్నారని భారత మైనారిటీ వ్యవహరాల శాఖ పేర్కొంది. మార్చ్14న డ్రా ద్వారా హజ్ యాత్రికులను ఎంపిక చేస్తామని అధికారులు సౌదీ ప్రభుత్వానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 2052 మంది హజ్ యాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ప్రస్తుతం 2728కు పెంచారు. తెలంగాణ నుంచి గతంలో 2532 మంది వెళ్తే, ప్రస్తుతం వీరి సంఖ్యను 3367కు పెంచారు. కేరళ నుంచి అత్యధికంగా హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. రెండవస్థానంలో మహరాష్ట్ర, తర్వాతి స్థానాల్లో గుజరాత్, కర్ణాటకలు ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 34,005గా సౌదీ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







