2019లోనూ అధికారం తమదే అని కాన్ఫిడెంట్గా ఉన్న కేటీఆర్

- March 15, 2017 , by Maagulf
2019లోనూ అధికారం తమదే అని కాన్ఫిడెంట్గా ఉన్న కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.  వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  అయినా కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఇంతకు ముందే చెప్పారని వ్యాఖ్యానించారు.  రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు కేసీఆర్ తమకు ఉన్నారని, ఇతర పార్టీల్లో ఇంతటి సమర్ధుడైన నాయకుడు కనిపించడని స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా 2019 వరకు ఉంటుందో లేదో చెప్పలేమంటూ అప్పటికి ఏమైనా జరగొచ్చంటూనే ప్రస్తుతానికి మోదీ పాలనకు ఢోకాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com