ట్రావెల్ అలవెన్స్ కోసం ఫర్జరీ
- March 15, 2017
ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు, ట్రావెల్ అలవెన్స్ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను రూపొందించింది. తన భర్త నుంచి విడిపోయినట్లుగా, తాను ఒంటరిగా ఉంటున్నట్లుగా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందామె. తద్వారా సింగిల్ మదర్స్కి దక్కే ట్రావెల్ అలవెన్స్ దక్కించుకోవాలని ఆమె ప్లాన్ చేసింది. అబుదాబీలోని పబ్లిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళ, నాలుగు అధికారిక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు అబుదాబీ క్రిమినల్ కోర్ట్ నిర్ధారించింది. ఈ ఫోర్జరీ ప్రక్రియలో ఆమెతోపాటు ఐదుగురు కొలీగ్స్ కూడా నిందితులుగా తేల్చింది న్యాయస్థానం. ఫోర్జరీతోపాటు, పబ్లిక్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిన కేసులో ఆమెపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు, అసలు నిందితురాలి వివాహ స్థితిపై తమకెలాంటి సమాచారం తెలియదని చెప్పారు. ఈ కేసు విచారణ మార్చ్ 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







