ట్రావెల్‌ అలవెన్స్‌ కోసం ఫర్జరీ

- March 15, 2017 , by Maagulf
ట్రావెల్‌ అలవెన్స్‌ కోసం ఫర్జరీ

ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు, ట్రావెల్‌ అలవెన్స్‌ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను రూపొందించింది. తన భర్త నుంచి విడిపోయినట్లుగా, తాను ఒంటరిగా ఉంటున్నట్లుగా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందామె. తద్వారా సింగిల్‌ మదర్స్‌కి దక్కే ట్రావెల్‌ అలవెన్స్‌ దక్కించుకోవాలని ఆమె ప్లాన్‌ చేసింది. అబుదాబీలోని పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళ, నాలుగు అధికారిక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు అబుదాబీ క్రిమినల్‌ కోర్ట్‌ నిర్ధారించింది. ఈ ఫోర్జరీ ప్రక్రియలో ఆమెతోపాటు ఐదుగురు కొలీగ్స్‌ కూడా నిందితులుగా తేల్చింది న్యాయస్థానం. ఫోర్జరీతోపాటు, పబ్లిక్‌ ఫండ్స్‌ని దుర్వినియోగం చేసిన కేసులో ఆమెపై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు, అసలు నిందితురాలి వివాహ స్థితిపై తమకెలాంటి సమాచారం తెలియదని చెప్పారు. ఈ కేసు విచారణ మార్చ్‌ 22కి వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com