అంచలంచలుగా పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు..!
- September 25, 2015
బంగారం ధర నెల రోజుల గరిష్ఠానికి చేరింది. మళ్లీ రూ.27,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.400 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. పెళ్లిళ్ల సీజను ముందుండటం, రీటైలర్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం తదితర కారణాల వల్ల ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.11శాతం పెరిగి 1,152 అమెరికన్ డాలర్లకు చేరింది.పెరిగిన వెండిఈ రోజు వెండి సైతం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగి రూ.36,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.1,100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.15 అమెరికన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







