అంచలంచలుగా పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు..!
- September 25, 2015
బంగారం ధర నెల రోజుల గరిష్ఠానికి చేరింది. మళ్లీ రూ.27,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.400 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. పెళ్లిళ్ల సీజను ముందుండటం, రీటైలర్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం తదితర కారణాల వల్ల ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.11శాతం పెరిగి 1,152 అమెరికన్ డాలర్లకు చేరింది.పెరిగిన వెండిఈ రోజు వెండి సైతం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగి రూ.36,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.1,100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.15 అమెరికన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









