వ్యర్ధాలనుంచీ అద్భుతాలు సృష్టించవచ్చు
- September 25, 2015
కుళ్ళిపోయిన ఆహార వ్యర్ధాల నుంచి మీథేన్ వాయువును సేకరించి దాన్నుంచి విద్యుత్ని తయారు చేయవచ్చనీ, అలాగే వ్యర్థాలను కంపోస్ట్గా కూడా ఉపయోగించవచ్చని ఓ ప్రముఖ కౌన్సిలర్ ప్రతిపాదించారు. ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ అల్ కూహెజి, వ్యర్ధాలను పారవేయడం కన్నా వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తన ఆలోచనలను కార్యరూపంలోకి మలచేందుకు తమ కౌన్సిల్ మున్సిపాలిటీలు మరియు అర్బన్ ప్లానింగ్ ఎఫైర్స్ మినిస్టర్ ఖలీఫ్ సహాయంతో అధునాతన రీసైక్లింగ్ సెంటర్ అవసరమని చెప్పారు. వ్యర్ధాల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నారాయన. ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడం మంచిదనీ, అది భూమిలో కలవడం వలన ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు కూహెజి. ఆహార వ్యర్ధాలు కుళ్ళిన తర్వాత దాన్నుంచి మీథేన్ వస్తుందనీ, భూమి మీద పారేయడం లేదా పాతి పెట్టడం ద్వారా విలువైన మీథేన్ శక్తి వృధా అవుతుందని చెప్పారాయన. బార్సెలోనాలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లను తాను చూశాననీ, తద్వారా సేకరించిన గ్యాస్తో పవర్ని తయారుచేస్తారని వివరించారు. బహరెయిన్లో మూడు కన్నా ఎక్కువ అంతస్తులు గల భవనాల్లో ఖచ్చితంగా వేస్టేజ్ కోసం ఓ రూమ్ని ఏర్పాటు చేయాలని సూచించారు కూహెజి. రోజువారీ 1.5 మిలియన్ టన్నుల వేస్టేజ్ ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని కూహెజి చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







