వ్యర్ధాలనుంచీ అద్భుతాలు సృష్టించవచ్చు
- September 25, 2015
కుళ్ళిపోయిన ఆహార వ్యర్ధాల నుంచి మీథేన్ వాయువును సేకరించి దాన్నుంచి విద్యుత్ని తయారు చేయవచ్చనీ, అలాగే వ్యర్థాలను కంపోస్ట్గా కూడా ఉపయోగించవచ్చని ఓ ప్రముఖ కౌన్సిలర్ ప్రతిపాదించారు. ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ అల్ కూహెజి, వ్యర్ధాలను పారవేయడం కన్నా వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తన ఆలోచనలను కార్యరూపంలోకి మలచేందుకు తమ కౌన్సిల్ మున్సిపాలిటీలు మరియు అర్బన్ ప్లానింగ్ ఎఫైర్స్ మినిస్టర్ ఖలీఫ్ సహాయంతో అధునాతన రీసైక్లింగ్ సెంటర్ అవసరమని చెప్పారు. వ్యర్ధాల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నారాయన. ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడం మంచిదనీ, అది భూమిలో కలవడం వలన ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు కూహెజి. ఆహార వ్యర్ధాలు కుళ్ళిన తర్వాత దాన్నుంచి మీథేన్ వస్తుందనీ, భూమి మీద పారేయడం లేదా పాతి పెట్టడం ద్వారా విలువైన మీథేన్ శక్తి వృధా అవుతుందని చెప్పారాయన. బార్సెలోనాలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లను తాను చూశాననీ, తద్వారా సేకరించిన గ్యాస్తో పవర్ని తయారుచేస్తారని వివరించారు. బహరెయిన్లో మూడు కన్నా ఎక్కువ అంతస్తులు గల భవనాల్లో ఖచ్చితంగా వేస్టేజ్ కోసం ఓ రూమ్ని ఏర్పాటు చేయాలని సూచించారు కూహెజి. రోజువారీ 1.5 మిలియన్ టన్నుల వేస్టేజ్ ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని కూహెజి చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









