అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరిన ఆకుల రాజేష్‌ మృతదేహం

- March 18, 2017 , by Maagulf
అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరిన ఆకుల రాజేష్‌ మృతదేహం

జగిత్యాలలో రాయికల్‌లోని సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేష్‌, దురదృష్టవశాత్తూ అబుదాబీలో మార్చ్‌ 10వ తేదీన మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం జరిగింది. మార్చ్‌ 17న ముంబై మీదుగా అబుదాబీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో హైద్రాబాద్‌కి చేరుకుంది ఆయన మృతదేహం. ఆకుల సురేష్‌, మృతదేహంతో పాటుగా అదే విమానంలో ఇండియాకి చేరుకున్నారు. గాజర్ల తిరుపతి, హైద్రాబాద్‌ విమానాశ్రయంలో మృతదేహాన్ని రిసీవ్‌ చేసుకుని, స్వగ్రామం వరకు తీసుకెళ్ళారు. యూఏఈలోని తెలంగాణ ఎమిగ్రెంట్స్‌ లేబర్‌ యూనియన్‌ (టెలు) ప్రెసిడెంట్‌ కాదర్ల రంజిత్‌ కుమార్‌, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి - ఆకుల రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించారు. 

ఎం. భీమ్ రెడ్డి​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com