అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరిన ఆకుల రాజేష్ మృతదేహం
- March 18, 2017
జగిత్యాలలో రాయికల్లోని సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేష్, దురదృష్టవశాత్తూ అబుదాబీలో మార్చ్ 10వ తేదీన మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం జరిగింది. మార్చ్ 17న ముంబై మీదుగా అబుదాబీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో హైద్రాబాద్కి చేరుకుంది ఆయన మృతదేహం. ఆకుల సురేష్, మృతదేహంతో పాటుగా అదే విమానంలో ఇండియాకి చేరుకున్నారు. గాజర్ల తిరుపతి, హైద్రాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని రిసీవ్ చేసుకుని, స్వగ్రామం వరకు తీసుకెళ్ళారు. యూఏఈలోని తెలంగాణ ఎమిగ్రెంట్స్ లేబర్ యూనియన్ (టెలు) ప్రెసిడెంట్ కాదర్ల రంజిత్ కుమార్, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి - ఆకుల రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించారు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







