భూములు రెడీ బందరు పోర్టుకు
- March 18, 2017
రేపు 3014 ఎకరాలు అప్పగింత
బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమ ల అప్పగింతకు రంగం సిద్ధమైంది. మొత్తం 4,800 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించా ల్సి ఉండగా, వాటిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు 3014.43 ఎకరాలు ఉన్నాయి. తొలుత ఈ భూములను పోర్టుకు అప్పగించాలని ఇటీవల కృష్ణాజిల్లా కలెక్టర్ బాబుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో... అందుకనుగుణంగా అధికారులు చర్య లు చేపట్టారు. శనివారం ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన హద్దులను అధికారు లు పరిశీలించారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతోపాటు ఇండస్ర్టియల్ కారిడార్, మెగా టౌన్షిప్ ఏర్పాటు కోసం 33,177.78 ఎకరాలకు భూ సమీకరణ జరుగుతోంది.
ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ(ముడా)ని ఏర్పాటు చేసింది. భూ సమీకరణపై రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు భూములకు సంబంధించి కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సి ఉండటంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికారులు దృష్టి సారించారు. పోర్టుతోపాటు ఇండస్ర్టియల్ కారిడార్, మెగా టౌన్షిప్ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రక్రియ చేపట్టగా, తొలుత పోర్టు భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బందరు మండలంలోని మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి, బందరు రూరల్ గ్రామాల్లో పోర్టు భూములను గుర్తించగా, ఆ భూములకు సంబంధించిన సర్వే తదితర కార్యక్రమాలు ఇంతకు ముందే పూర్తయ్యాయి. ఆయా భూముల్లో ముడా అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ, అసైన్డ్ భూముల హద్దులను మరోసారి పరిశీలించారు. మచిలీపట్నం తహసిల్దార్ నారదముని, బందరు పోర్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.మునిరెడ్డి, ముడా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించారు.
వీటి అప్పగింతల ప్రక్రియ సోమవారం జరుగుతుందని ముడా వైస్ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









