హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్లో
- March 18, 2017
ప్రజాపనుల విభాగం సారథిగా కరుణ్ శ్రీరామ
హ్యూస్టన్, మార్చి 18: హ్యూస్టన్ ప్రజాపనులు, ఇంజనీరింగ్ విభాగం(పీడబ్ల్యూడీ) డైరెక్టర్గా భారత అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ(53) నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన ఆయన.. 4 వేల మంది ఉద్యోగులున్న పీడబ్ల్యూడీ విభాగం బాధ్యతలను వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
పీడబ్ల్యూడీ డైరెక్టర్గా శ్రీరామను నియమిస్తూ మేయర్ సిల్విస్టర్ టర్నర్ ఆదేశాలిచ్చారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్గా శ్రీరామ రికార్డుల్లో కి ఎక్కనున్నారు. అమెరికాలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఆయనకు ఈ రంగంలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







