కబాలీ రైస్
- March 19, 2017
కావలసినవి: బాస్మతి బియ్యం అర కేజి, శనగపప్పు 200 గ్రా., తరిగిన ఉల్లిపాయలు 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి 6, అల్లం-వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు, కారం అర టేబుల్ స్పూను, గరం మసాలా 10గ్రా., పుదీనా ఒక కట్ట, నిమ్మకాయ ఒకటి, నెయ్యి 50 గ్రా., కుంకుమ పువ్వు చిటికెడు, నూనె 50 గ్రా., పెరుగు 2 కప్పులు ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
బియ్యాన్ని శుభ్రం చేసి నీళ్లలో నానబెట్టాలి. శనగపప్పును కుక్కర్లో ఉడికించాలి. బియ్యాన్ని మూడొంతులు ఉడికించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత ఉడికిన శనగపప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాణలిలో నెయ్యి వేడి చేయాలి. అన్నంలో సగభాగాన్ని బాణలిలో వేయాలి. దాని పైన శనగపప్పు మిశ్రమాన్ని ఈ అన్నంపైన పొరలా వేయాలి. దాని పైన మిగిలిన అన్నాన్ని కూడా వేసి కొద్దిగా నెయ్యి పోయాలి. దాని పైన నిమ్మరసాన్ని చల్లాలి. కుంకుమ పువ్వు కూడా చల్లి మొత్తమంతా కలిపి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వడ్డించే ముందు అన్నాన్ని బాగా కలపాలి. దీనిని వేడి వేడిగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







