విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- February 01, 2026
న్యూ ఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశీ యాత్రల ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న TCS ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో విదేశీ విమాన ప్రయాణాలు, టూర్ ప్యాకేజీల ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. మధ్యతరగతి ప్రజలు మరియు పర్యాటక ప్రియులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
పన్ను నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేత కేసుల్లో ఇప్పటి వరకు ఉన్న జైలు శిక్ష నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడానికి జరిమానాను కఠినతరం చేశారు. ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించబడుతుంది. దీనివల్ల అనవసరమైన కోర్టు కేసులు తగ్గి, పన్ను వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







