విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- February 01, 2026
న్యూ ఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశీ యాత్రల ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న TCS ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో విదేశీ విమాన ప్రయాణాలు, టూర్ ప్యాకేజీల ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. మధ్యతరగతి ప్రజలు మరియు పర్యాటక ప్రియులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
పన్ను నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేత కేసుల్లో ఇప్పటి వరకు ఉన్న జైలు శిక్ష నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడానికి జరిమానాను కఠినతరం చేశారు. ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించబడుతుంది. దీనివల్ల అనవసరమైన కోర్టు కేసులు తగ్గి, పన్ను వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







