యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- February 01, 2026
యూఏఈః యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే ప్రకటించిన గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 3తో ముగుస్తుందని అబుదాబి మునిసిపాలిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఉచితం అని, TAMM ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్లో పూర్తి చేయవచ్చని తెలిపింది. గడువు తర్వాత నమోదు చేయని పెంపుడు జంతువుల యజమానులకు Dh1,000 జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించని వారికి Dh500 నాన్-రెన్యువల్ జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. అబుదాబిలో పెంపుడు జంతువులను వదిలివేయడం జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పెంపుడు జంతువులను వీధిలో వదిలివేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి Dh2,000 జరిమానా విధించబడుతుంది. అదే సమయంలో, జంతువులను నిర్లక్ష్యం చేస్తే యూఏఈ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 471 ప్రకారం Dh5,000 వరకు జరిమానా విధించబడుతుందని అబుదాబి మునిసిపాలిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









