యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- February 01, 2026
యూఏఈః యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే ప్రకటించిన గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 3తో ముగుస్తుందని అబుదాబి మునిసిపాలిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఉచితం అని, TAMM ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్లో పూర్తి చేయవచ్చని తెలిపింది. గడువు తర్వాత నమోదు చేయని పెంపుడు జంతువుల యజమానులకు Dh1,000 జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించని వారికి Dh500 నాన్-రెన్యువల్ జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. అబుదాబిలో పెంపుడు జంతువులను వదిలివేయడం జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పెంపుడు జంతువులను వీధిలో వదిలివేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి Dh2,000 జరిమానా విధించబడుతుంది. అదే సమయంలో, జంతువులను నిర్లక్ష్యం చేస్తే యూఏఈ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 471 ప్రకారం Dh5,000 వరకు జరిమానా విధించబడుతుందని అబుదాబి మునిసిపాలిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







