యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- February 01, 2026
యూఏఈః యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే ప్రకటించిన గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 3తో ముగుస్తుందని అబుదాబి మునిసిపాలిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఉచితం అని, TAMM ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్లో పూర్తి చేయవచ్చని తెలిపింది. గడువు తర్వాత నమోదు చేయని పెంపుడు జంతువుల యజమానులకు Dh1,000 జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించని వారికి Dh500 నాన్-రెన్యువల్ జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. అబుదాబిలో పెంపుడు జంతువులను వదిలివేయడం జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పెంపుడు జంతువులను వీధిలో వదిలివేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి Dh2,000 జరిమానా విధించబడుతుంది. అదే సమయంలో, జంతువులను నిర్లక్ష్యం చేస్తే యూఏఈ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 471 ప్రకారం Dh5,000 వరకు జరిమానా విధించబడుతుందని అబుదాబి మునిసిపాలిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!









