యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- February 01, 2026
యూఏఈః యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే ప్రకటించిన గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 3తో ముగుస్తుందని అబుదాబి మునిసిపాలిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఉచితం అని, TAMM ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్లో పూర్తి చేయవచ్చని తెలిపింది. గడువు తర్వాత నమోదు చేయని పెంపుడు జంతువుల యజమానులకు Dh1,000 జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించని వారికి Dh500 నాన్-రెన్యువల్ జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. అబుదాబిలో పెంపుడు జంతువులను వదిలివేయడం జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పెంపుడు జంతువులను వీధిలో వదిలివేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి Dh2,000 జరిమానా విధించబడుతుంది. అదే సమయంలో, జంతువులను నిర్లక్ష్యం చేస్తే యూఏఈ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 471 ప్రకారం Dh5,000 వరకు జరిమానా విధించబడుతుందని అబుదాబి మునిసిపాలిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







