కబాలీ రైస్
- March 19, 2017
కావలసినవి: బాస్మతి బియ్యం అర కేజి, శనగపప్పు 200 గ్రా., తరిగిన ఉల్లిపాయలు 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి 6, అల్లం-వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు, కారం అర టేబుల్ స్పూను, గరం మసాలా 10గ్రా., పుదీనా ఒక కట్ట, నిమ్మకాయ ఒకటి, నెయ్యి 50 గ్రా., కుంకుమ పువ్వు చిటికెడు, నూనె 50 గ్రా., పెరుగు 2 కప్పులు ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
బియ్యాన్ని శుభ్రం చేసి నీళ్లలో నానబెట్టాలి. శనగపప్పును కుక్కర్లో ఉడికించాలి. బియ్యాన్ని మూడొంతులు ఉడికించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత ఉడికిన శనగపప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాణలిలో నెయ్యి వేడి చేయాలి. అన్నంలో సగభాగాన్ని బాణలిలో వేయాలి. దాని పైన శనగపప్పు మిశ్రమాన్ని ఈ అన్నంపైన పొరలా వేయాలి. దాని పైన మిగిలిన అన్నాన్ని కూడా వేసి కొద్దిగా నెయ్యి పోయాలి. దాని పైన నిమ్మరసాన్ని చల్లాలి. కుంకుమ పువ్వు కూడా చల్లి మొత్తమంతా కలిపి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వడ్డించే ముందు అన్నాన్ని బాగా కలపాలి. దీనిని వేడి వేడిగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







