మళ్లీ ఒక్కటి కాబోతున్న సంగీత దిగ్గజాలు బాలు ఇళయరాజా
- March 22, 2017
తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ తెలిపారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఎస్పీబీ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆసందర్భంగా తన ముందస్తు అనుమతి లేకుండా సంగీత కచేరీలలో తన సంగీత దర్శకత్వంలో రూపొందిన సినిమా పాటలను పాడరాదని ఎస్పీబీకి ఇళయరాజా లాయర్ నోటీసు పంపారు. ఆ నోటీసుపై స్పందించిన ఎస్పీబీ ఇకపై తన సంగీత కచేరీలలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన పాటలను పాడనని ప్రకటించారు.
ఇలా ఇరువురి మధ్య మనస్పర్థలు తీవ్రమైన తరుణంలో విశాల్ ఆ ఇరువురు ఒకేవేదికపై సంగీత విభావరిలో పాల్గొంటారని ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరితో మాట్లాడినట్లు విశాల్ తెలిపారు. ఎదేమైనా సంగీత దిగ్గజాలను మళ్లీ ఒక్కటి చేస్తున్నందకు విశాల్ను అభినందించాల్సిందే నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇళయరాజాకు సన్మానసభ జరుపుతామని విశాల్ తెలిపారు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







