అగ్నికి స్వల్పంగా ఆహుతైన పాడుబడిన భవనం
- March 25, 2017
స్థానిక గుదైబియాలో ఒక పాడుబడిన భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సాధారణంగా ఈ భవంతిని స్థానికులు కాపిటల్ కువైట్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరకి గాయాలు కాలేదని తెలుస్తుంది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అగ్నికీలలు ఆ భవనంని అకస్మాత్తుగా వ్యాపించాయి. వేణు వెంటనే సివిల్ డిఫెన్స్ కు చెందిన అగ్నిమాపకదళం సభ్యులు గుదైబియా లోని "కువైట్ బిల్డింగ్" వద్దకు వేగంగా సన్నివేశ స్ధలానికి చేరుకొని ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపులోనికి తెచ్చారు. సివిల్ డిఫెన్స్ లో గుదైబియా ఒక భవనంలో అగ్నికి నాశనమైందని పోలీసులు సన్నివేశం స్ధలానికి చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంఘటన గూర్చి ధ్రువీకరించారు.ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదించారు.ఈ వారం ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్ మరియు మినా సల్మాన్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఒక గిడ్డంగి వద్ద ఇటువంటి సంఘటనలు రెండుసార్లు జరగ్గా, ఇది మూడో అగ్ని ప్రమాదంగా నమోదు కాబడింది.
తాజా వార్తలు
- ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం 2026 ప్రారంభం
- అగ్రనేతల మధ్య ముదిరిన విభేదాలు
- కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్..
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!









