అగ్నికి స్వల్పంగా ఆహుతైన పాడుబడిన భవనం
- March 25, 2017
స్థానిక గుదైబియాలో ఒక పాడుబడిన భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సాధారణంగా ఈ భవంతిని స్థానికులు కాపిటల్ కువైట్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరకి గాయాలు కాలేదని తెలుస్తుంది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అగ్నికీలలు ఆ భవనంని అకస్మాత్తుగా వ్యాపించాయి. వేణు వెంటనే సివిల్ డిఫెన్స్ కు చెందిన అగ్నిమాపకదళం సభ్యులు గుదైబియా లోని "కువైట్ బిల్డింగ్" వద్దకు వేగంగా సన్నివేశ స్ధలానికి చేరుకొని ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపులోనికి తెచ్చారు. సివిల్ డిఫెన్స్ లో గుదైబియా ఒక భవనంలో అగ్నికి నాశనమైందని పోలీసులు సన్నివేశం స్ధలానికి చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంఘటన గూర్చి ధ్రువీకరించారు.ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదించారు.ఈ వారం ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్ మరియు మినా సల్మాన్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఒక గిడ్డంగి వద్ద ఇటువంటి సంఘటనలు రెండుసార్లు జరగ్గా, ఇది మూడో అగ్ని ప్రమాదంగా నమోదు కాబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







