బీఎస్ఎఫ్కు తొలి మహిళా అధికారిణి
- March 25, 2017
ఉగ్రవాదం, దేశ సరిహద్దుల సంరక్షణలో భారత సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తాయి. 51 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మహిళా బీఎస్ఎఫ్ అధికారిణిని నియమించారు. రాజస్థాన్లోని బికనీర్కు చెందిన తనుశ్రీ పరీక్ (25) బీఎస్ఎఫ్ అధికారిణిగా నియమితులయ్యారు. 2014 అర్హతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ మహారాష్ట్రలోని తేనక్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలో 52వారాల శిక్షణ తీసుకున్నారు. శనివారంతో ఆమె శిక్షణకాలం ముగిసింది. అక్కడ నిర్వహించిన బీఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనుశ్రీను అభినందించి సన్మానించారు.
‘బీఎస్ఎఫ్లో మహిళా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు బీఎస్ఎఫ్లో చేరాలని’ ఆయన ఆకాంక్షించారు. తనుశ్రీ పంజాబ్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వర్తించనున్నారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









