బీఎస్ఎఫ్కు తొలి మహిళా అధికారిణి
- March 25, 2017
ఉగ్రవాదం, దేశ సరిహద్దుల సంరక్షణలో భారత సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తాయి. 51 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మహిళా బీఎస్ఎఫ్ అధికారిణిని నియమించారు. రాజస్థాన్లోని బికనీర్కు చెందిన తనుశ్రీ పరీక్ (25) బీఎస్ఎఫ్ అధికారిణిగా నియమితులయ్యారు. 2014 అర్హతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ మహారాష్ట్రలోని తేనక్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలో 52వారాల శిక్షణ తీసుకున్నారు. శనివారంతో ఆమె శిక్షణకాలం ముగిసింది. అక్కడ నిర్వహించిన బీఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనుశ్రీను అభినందించి సన్మానించారు.
‘బీఎస్ఎఫ్లో మహిళా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు బీఎస్ఎఫ్లో చేరాలని’ ఆయన ఆకాంక్షించారు. తనుశ్రీ పంజాబ్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వర్తించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









