'గురు' సినిమా కోసం చిరంజీవి సహకారాన్ని కోరిన వెంకీ
- March 27, 2017
ఈనెల 31న విడుదల కాబోతున్న 'గురు' సినిమా పై భారీ ఆసలు పెట్టుకున్నాడు వెంకటేష్. ఆ ఆశలకు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి సహకారం కూడ తన 'గురు' సినిమాకు రావడంతో ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు వెంకీ. ఈ మూవీ కోసం టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలుస్తున్నారు.
ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించకపోయినా బుల్లితెర పై ఈ వారం వీరిద్దరూ చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో సందడి చేయబోతున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న 'గురు' సినిమాను ప్రమోట్ చేయడానికి 'ఉగాది' రోజున ప్రసారం కాబోతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి వెంకటేష్ అతిథిగా రాబోతున్నాడు.
ఈ షోలో 'గురు' సినిమా గురించి వెంకటేష్ పడిన కష్టం గురించి అనేక ఆసక్తికర విషయాలు చిరంజీవి నోటి వెంట చెప్పిస్తారని తెలుస్తోంది. పండుగరోజు ప్రసారమయ్యే కార్యక్రమం కాబట్టి ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు భావిస్తున్నట్లు టాక్.
తన 75వ సినిమాకు అతి చేరువలో ఉన్న వెంకటేష్ ను అతడి కెరియర్ కు సంబంధించి అదేవిధంగా అతడితో నటించిన అనేకమంది హీరోయిన్స్ గురించి అనేక ఆసక్తికర ప్రశ్నలు చిరంజీవి ఈ కార్యక్రమంలో వెంకటేష్ ను అడగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటివరకు తగ్గతూ వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో రేటింగ్స్ ఇప్పుడు నిలకడగా కొనసాడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
దీనితో ఈషో రేటింగ్స్ ను మరింత పెంచడానికి టాలీవుడ్ కు అదేవిధంగా దక్షిణాది సినిమా రంగానికి చెందిన చాలామంది ఫిలిం సెలెబ్రెటీలను ఈషోకు పిలిచే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు టాక్. వెంకీ ఎప్పీయరెన్స్ తో కోటీశ్వరుడు రేటింగ్స్ పెరుగుతాయా లేదంటే చిరంజీవి సహకారంతో 'గురు' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయా ? అన్నది ఈ వారం తేలిపోతుంది..
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









