ఓమాన్ లో గుండెపోటుతో మృతిచెందిన మహిళ

- March 28, 2017 , by Maagulf
ఓమాన్ లో గుండెపోటుతో మృతిచెందిన మహిళ

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోగల తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం ప్రాంతంలోని పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన పెన్నమ్‌రెడ్డి అచ్చివేణి అనే మహిళ ఒమన్‌లో మార్చి 18వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఒమన్‌ ఎయిర్‌ ద్వారా హైదరాబాద్‌ విమానాశ్రయానికి తరలించారు. మార్చి 28న అచ్చివేణి మృతదేహం హైదరాబాద్‌కి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు నాగిరెడ్డి రాంబాబు, ఎం. హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి అంత్యక్రియల కోసం తరలించారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఆమె అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com