దుబాయ్ లో అనుపమ మోహన్ చే కూచిపూడి నాట్యాభివృద్ధి వర్క్ షాప్
- March 29, 2017

పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం గారి శిష్య బృందం లో ప్రఖ్యాతి గాంచిన నాట్య విశారద అనుపమ మోహన్ గారు కేరళ రాష్ట్రం లో స్థిరపడి ఆ రాష్ట్రం లో కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సత్యాంజలి అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ ని స్థాపించి ఎంతో మంది శిష్యులను తీర్చి దిద్దుతున్నారు. సంవత్సరానికి రెండు డాన్స్ ఫెస్టివల్స్ మరియు పలు చోట్ల ఎన్నో వర్క్ షాప్స్ నిర్వహిస్తూ శ్రీమతి అనుపమ మోహన్ కూచిపూడి నాట్యాన్ని పలుదిశల అభివృద్ధి చేస్తూ భావితరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగం గా అనుపమ మోహన్ ఇటీవలే దుబాయ్ లో మార్చ్ 17 నుంచి 27 వరకు (8 వర్కింగ్ డేస్) కూచిపూడి నాట్యాభివృధి వర్కుషాప్ నిర్వహించారు. సీనియర్స్ మరియు జూనియర్స్ బ్యాచెస్ గా పిల్లలకు అడవు, జాతి లు మరి రెండు శాస్త్రీయ నృత్యాలు నేర్పారు.
ఈ సందర్బంగా శ్రీమతి పద్మజ మాట్లాడుతూ మా అమ్మాయి కృష ఈ వర్కుషాప్ వల్ల ఎంతో లబ్ది పొందింది. కూచిపూడి నాట్యం లో మెలుకువలు తెలుసుకుంది అని తెలిపారు. అనుపమ మోహన్కి కృతఙ్ఞతలు తెలిపారు. కేరళ రాష్ట్రం వారు మన కూచిపూడి కళ పట్ల ఎంతో ఆసక్తి చూపించటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన తెలుగు వారు కూడా మన పిల్లలకి కూచిపూడి కళ పట్ల ప్రోత్సహిస్తూ పిల్లలకు నేర్పించి, మన శాస్త్రీయ నృత్యాన్ని విస్తరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహుకురాలు శ్రీమతి. సంధ్యని అభినందించారు.
ఈ కార్యక్రమం లో పాల్గున్న వారు పవిత్ర, నీహారిక, నివేదిత,విష్ణుప్రియ, గాయత్రి, లక్ష్మి,
మీనాక్షి, హ్రితిక, సాత్విక, సర్గా, సరితా, మాళవిక, సంధ్య, క్రిష.


తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







