పూరి కొత్త సినిమా 'హే భగవాన్'
- March 29, 2017
హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ . కేవలం మూడు నెలల్లోనే సినిమా తీసి , థియేటర్స్ లలో రప్పించగల డాషింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భాంగా పూరి మాట్లాడుతూ..ప్రస్తుతం బాలకృష్ణ తో ఓ మూవీ చేస్తున్నాని , ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని తెలిపాడు. ఈ మూవీ తర్వాత 'హే భగవాన్' అనే మూవీ చేస్తానని తెలిపాడు.
కాకపోతే ఈ చిత్రం లో ఎవరు హీరో హీరో అనేది చెప్పకుండా, దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయనే అంశాన్ని మూవీలో చూపించబోతున్నట్లు చెప్పాడు పూరీ.
ఇక ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రోగ్ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ మూవీ మార్చ్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల కాలంలో పూరి వరుస ప్లాప్స్ తో ఉన్నాడు.
మరి రోగ్ అయిన హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







