సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో రన్వేపై ఢీకొన్న విమానాలు
- March 30, 2017సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. రన్వేపై టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అయితే పైలెట్లు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పి.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
303 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో చైనాలోని టియాంజిన్ వెళ్తున్న స్కూట్ ఎయిర్లైన్ విమానం చాంగీ ఎయిర్పోర్టు రన్వేపై టేకాఫ్కు సిద్ధమైంది. ఇంతలో స్కూట్ విమానం లెఫ్ట్ వింగ్.. అదే రన్వేపై టేకాఫ్ చేసుకుంటున్న ఎమిరేట్స్ విమానాన్ని తాకాయి.
అయితే పైలెట్లు అప్రమత్తమై విమానాలను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను దింపేసి.. దెబ్బతిన్న విమానాలను రిపేర్కు పంపించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.
ఎమిరేట్స్ విమానం దుబాయికి వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ