యుఎఇ ప్రధాన రహదారి రెండు రోజుల పాటు మూసివేయనున్నారు
- March 31, 2017
ఖలీద్ సరస్సు ఎదురుగా ఉన్న అల్ మజాజ్-3 కార్నిష్ వీధిని పాక్షికంగా ఓ రెండు రోజులు పాటు మూసివేయనున్నట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఒక ప్రకటనలో తెలిపింది.అధికారిక సమాచారం మేరకు మూడు లైన్ల రహదారిలో ఉన్న రెండు దారులను నిర్వహణ పనుల నిమిత్తం రెండు రోజుల పాటు మూసివేయబడ్డాయి. సెంట్రల్ సూక్ అల్ లియా ప్రాంతం నుండి ప్రాధాన్యత గల ఆ ప్రాంతంలో ఒకే ఒక లైన్ల ట్రాఫిక్ కొరకు అందుబాటులో ఉంటుందని ఆ మార్గంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అదేవిధంగా అల్ ఎంటీఫేదా వీధి వెలుపలకు వెళ్లేందుకు దారి తీసే క్రోకార్నిష్ రహదారి కూడా మూసివేశారు, పాక్షిక రహదారి మూసివేత గురువారం నుండి మొదలు కాబడి శనివారం రాత్రి వరకు ఇది కొనసాగుతుందని ఆ తర్వాత ట్రాఫిక్ కొరకు తెరవనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. డ్రైవర్లు తమ తమ వాహనాల వేగాన్ని తగ్గించేందుకు శ్రద్ధ తీసుకోవాలని ట్రాఫిక్ రద్దీని తొలగించడం కోసం ప్రత్యామ్నాయ రోడ్ల వైపునకు మళ్లాలని కోరారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని , కానీ తాము సూచించిన రహదారి మల్లింపు వినియోగదారులకు ఎంతో ఉత్తమమైందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







