యువతీ మృతికి కారకుడైన జిసిసి వ్యక్తికి 200,000 క్యూ ఆర్ రక్త పరిహారం
- April 02, 2017
రోడ్డుపై దృష్టి నిలపక అడ్డదిడ్డంగా వాహనాలను నడిపేవారికి దోహా న్యాయస్థానం ఓ ఝలక్ ఇచ్చింది. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి తన ముందు మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువతిని ఢీ కొట్టి ఆమె మరణానికి కారణమైన జీసీసీ వ్యక్తికి దోహా క్రిమినల్ న్యాయస్థానం10, 000 కతర్ రియాళ్ళు జరిమానా విధించి ఆ యువతీ కుటుంబానికి రక్త పరిహారం కింద మరో 200,000 కతర్ రియాళ్ళు చెల్లించాలని ఆదేశించింది.మరణించిన ఆ యువతీ సి లైన్ ఏరియాలో తన క్వాడ్ బైక్ మీద నెమ్మదిగా వెళుతుండగా...వెనుక నుండి నిర్లక్ష్యంగా మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న జీసీసీ వ్యక్తి ఆ యువతీ క్వాడ్ బైక్ ను అత్యంత వేగంగా.' డీ ' కొట్టాడు. దీనితో ఆ యువతీ తన ద్విచక్ర వాహనం పై నుంచి గాలిలోనికి ఎగిరి మరో కారుని బలంగా తాకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ కేసులో మరణించిన యువతీ యొక్క చట్టపరమైన వారసులకు 200, 000 కతర్ రియళ్ళ రక్తపరిహారం చెల్లించాలని ప్రతివాదికి గౌరవనీయ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







