కతర్ లో 67 మంది భారతీయుల మృతి
- April 03, 2017
ఈ ఏడాది మొత్తం 67 మంది భారతీయులు మృతి చెందినట్లు దోహాలోని ఇండియన్ ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మార్చి 29 వరకు నమోదైన మరణాల సంఖ్య ఇది. సెంట్రల్ ప్రిజన్లో 180 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తుండగా, 80 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం డిపోర్టేషన్కి సంబంధించి అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఇంకో వైపున లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ - ఎంబసీ మొత్తం 674 ఫిర్యాదుల్ని మార్చి 30 వరకు అందుకుంది. ఇందులో 514 ఫిర్యాదుల్ని పరిష్కరించగా, 69 ఇంకా ఫాలో అప్లో ఉన్నాయి. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో అంబాసిడర్ పి కుమారన్, డిప్యూటీ చాఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ మరికొందరు అధికారులు హాజరయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ డేవిస్ ఎడాకాలాతూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







