కతర్ లో 67 మంది భారతీయుల మృతి
- April 03, 2017
ఈ ఏడాది మొత్తం 67 మంది భారతీయులు మృతి చెందినట్లు దోహాలోని ఇండియన్ ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మార్చి 29 వరకు నమోదైన మరణాల సంఖ్య ఇది. సెంట్రల్ ప్రిజన్లో 180 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తుండగా, 80 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం డిపోర్టేషన్కి సంబంధించి అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఇంకో వైపున లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ - ఎంబసీ మొత్తం 674 ఫిర్యాదుల్ని మార్చి 30 వరకు అందుకుంది. ఇందులో 514 ఫిర్యాదుల్ని పరిష్కరించగా, 69 ఇంకా ఫాలో అప్లో ఉన్నాయి. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో అంబాసిడర్ పి కుమారన్, డిప్యూటీ చాఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ మరికొందరు అధికారులు హాజరయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ డేవిస్ ఎడాకాలాతూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







