78 కిలోల దొంగ బంగారం విశాఖ విమానాశ్రయంలో
- April 03, 2017
కస్టమ్స్ కమిషనర్ బి హరేరామ్ వెల్లడి
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది (2016-17) 78 కిలోల దొంగ బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నట్టు కస్ట మ్స్ కమిషనర్ బి హరేమార్ తెలిపారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,609 కోట్ల ఆదాయాన్ని సాధించామని సోమవారం ఆయన చెప్పారు. వాస్తవానికి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు రూ.4,468 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. అంతకు 4.28 శాతం ఎక్కువ నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయంలో 16.39 శాతం వృద్ధి సాధించామన్నారు. విశాఖ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న వివిధ వస్తువుల ద్వారా రూ.22.42 కోట్లు రాబట్టామన్నారు.
పన్ను చెల్లించని వారి నుంచి రూ.4.01 కోట్లు వసూలు చేశామన్నారు. వ్యాపార వర్గాలకు రూ.659 కోట్లు రిఫండ్ చేశామన్నారు. గత ఏడా ది కంటే ఈ మొత్తం 53 కోట్లు అధికమని వివరించారు. ఎగుమతి, దిగుమతుల వ్యాపార వేగవంతానికి త్వరగా క్లియరెన్సలు ఇస్తున్నామని, సరుకు దిగుమతికి సగటున 2.37 రోజులు, ఎగుమతికి 2.85 రోజులు తీసుకుంటున్నామన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







