78 కిలోల దొంగ బంగారం విశాఖ విమానాశ్రయంలో
- April 03, 2017
కస్టమ్స్ కమిషనర్ బి హరేరామ్ వెల్లడి
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది (2016-17) 78 కిలోల దొంగ బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నట్టు కస్ట మ్స్ కమిషనర్ బి హరేమార్ తెలిపారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,609 కోట్ల ఆదాయాన్ని సాధించామని సోమవారం ఆయన చెప్పారు. వాస్తవానికి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు రూ.4,468 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. అంతకు 4.28 శాతం ఎక్కువ నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయంలో 16.39 శాతం వృద్ధి సాధించామన్నారు. విశాఖ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న వివిధ వస్తువుల ద్వారా రూ.22.42 కోట్లు రాబట్టామన్నారు.
పన్ను చెల్లించని వారి నుంచి రూ.4.01 కోట్లు వసూలు చేశామన్నారు. వ్యాపార వర్గాలకు రూ.659 కోట్లు రిఫండ్ చేశామన్నారు. గత ఏడా ది కంటే ఈ మొత్తం 53 కోట్లు అధికమని వివరించారు. ఎగుమతి, దిగుమతుల వ్యాపార వేగవంతానికి త్వరగా క్లియరెన్సలు ఇస్తున్నామని, సరుకు దిగుమతికి సగటున 2.37 రోజులు, ఎగుమతికి 2.85 రోజులు తీసుకుంటున్నామన్నారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







