సాయం చేయమంటూ కోరిన ట్వీటుకు స్పందించిన ఎంపీ కవిత
- April 04, 2017
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఓ యువకుడు ఆదుకోమంటూ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే 2014లో బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసమని వెళ్ళి విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు పోయాయి. ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకున్నాడు. ట్రీట్మెంట్ కోసం ఇప్పటివరకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖర్ తనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వికలాంగుల కోటాలో ఇప్పించగలరని మనవి చేసుకున్నాడు. కానీ ఇంతవరకూ ఎటువంటి సాయం అందలేదు. తక్షణమే స్పందించిన కవిత వివరాలు పంపమంటూ రీట్వీట్ చేశారు. ఆదుకుంటానని భరోసానిచ్చారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







