ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మళ్లీ నంది అవార్డుల పండగ
- April 05, 2017
నంది అవార్డుల వేడుక మళ్లీ కనువిందు చేయనుంది. 2012, 2013 సంవత్సరములకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2014, 15, 16 సంవత్సరాల నంది అవార్డులూ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయడానికీ, త్వరలోనే మూడు సంవత్సరాలకు గానూ అవార్డుల ఎంపిక పూర్తి చేయడానికి కసరత్తులు మొదలయ్యాయి. మరో విశేషం ఏమిటంటే... ఈ ఐదేళ్ల నంది అవార్డులను ఒకేసారి, ఒకే వేదికపై ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా నంది అవార్డుల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 1963 నుంచీ ఇదో ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2012 నుంచీ అవార్డుల సంగతిని ప్రభుత్వం పట్టించుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వం ‘సింహా’ అవార్డుల పేరిట పురస్కారాల్ని ఇవ్వాలని నిర్ణయించుకొన్న నేపథ్యంలో, ‘నంది’ ఆంధ్రప్రదేశ్కే ఉండిపోయింది. ఎప్పుడైతే ఎవరి అవార్డులు వారివి అనే ఆలోచన వచ్చిందో, అప్పుడే ఏపీ ప్రభుత్వం నంది అవార్డులపై కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా 2012, 13 నంది అవార్డుల విజేతల పేర్లు ప్రకటించారు. త్వరలోనే నాలుగేళ్ల అవార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది.
మరోవైపు నంది అవార్డుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే... ఈసారి అవార్డు వేడుక అంగరంగ వైభవంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. అందులో భాగంగా రెండు రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహించబోతున్నార్ట.
అవార్డులు ఎక్కడ ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనే విషయంలో ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నందితో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బిఎన్రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ అవార్డు, రఘపతి వెంకయ్య చలన చిత్ర అవార్డులూ కూడా ఒకేసారి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
2012, 2013 సంవత్సరాలకు గానూ ఆ అవార్డు గ్రహీతల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం (ఎన్టీఆర్ జాతీయ అవార్డు 2012), హేమమాలిని (ఎన్టీఆర్ జాతీయ అవార్డు 2013), సింగీతం శ్రీనివాసరావు (2012 బిఎన్రెడ్డి జాతీయ అవార్డు), కోదండరామిరెడ్డి (2013 బిఎన్రెడ్డి జాతీయ అవార్డు), దగ్గుబాటి సురేష్ బాబు (2012 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు), దిల్రాజు (2013 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు), కోడి రామకృష్ణ (2012 రఘుపతి వెంకయ్య అవార్డు), వాణిశ్రీ (2013 రఘపతి వెంకయ్య అవార్డు) లకు పురస్కారాలు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









