ఇరాక్‌లోని మషద్‌ నగరంలో భూకంపం: ఒకరి మృతి

- April 05, 2017 , by Maagulf
ఇరాక్‌లోని మషద్‌ నగరంలో భూకంపం: ఒకరి మృతి

ఇరాక్‌లోని మషద్‌ నగరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గానమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మషద్‌ నగరానికి 76 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్నిచోట్ల భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు హెలికాప్టర్లలో ఘటనాస్థలికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com