పునర్ నిర్మాణానికి బలమైన మద్దతు అవసరం: ప్రిన్స్ సుల్తాన్
- April 07, 2017
సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిహెచ్) ఛైర్మన్, ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ జెడ్డా చారిత్రక ఫెస్టివల్ అతారీక్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్నీ, పెవిలియన్స్నీ సందర్శించారు. చారిత్రక జెడ్డా పునర్ నిర్మాణానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు అవసరమని అన్నారాయన. జెడ్డాలోని వందలాది హెరిటేజ్ సైట్స్ని ఆధునీకరించేందుకు, అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు 30 ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నేషనల్ హెరిటేజ్ని సంరక్షించడంలో మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషా బిన్ మజెద్ కృషి చేస్తున్నారని కొనియాడారాయాన. ఫెస్టివల్స్ సుప్రీం కమిటీ, చారిత్రక జెడ్డా ప్రాంతాన్ని ఆర్కియాలజీ, హిస్టరీ పరంగా పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రిన్స్ సుల్తన్ చెప్పారు. అతారీక్ ఫెస్టివల్ని పాలస్తీనా కాన్సుల్ జనరల్ మహమ్మద్ అస్సాది, ఇరాక్ కాన్సూల్ జనరల్ ఖాలిద్ ఖైరో సందర్శించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







