భారత్లో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పర్యటన
- April 06, 2017
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన శుక్రవారం ప్రారంభం కానుంది. నాలుగు రోజుల ఈ పర్యటనలో రక్షణ,భద్రత, పౌర అణు ఇంధనం, ఇతర అంశాల్లో ఉభయ దేశాలు కనీసం 25 ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఏడేళ్ళ వ్యవధిలో హసీనా భారత్లో చేపడుతున్న తొలి పర్యటన ఇదే. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, హసీనా మధ్య చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదాన్ని నిరోధించడం, భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడం లాంటి ప్రధానమైన అంశాలపై వారు చర్చలు జరపనున్నారు. తర్వాత వివిధ అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఒక ఒప్పందం ప్రకారం సైనిక సామాగ్రి సరఫరా కోసం బంగ్లాదేశ్కు భారత్ భారీ రుణాన్ని అందించనుంది. పౌర అణు ఇంధన సహకారంపై కుదిరే ఒప్పందాన్ని అనుసరించి బంగ్లాదేశ్లో అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనుంది. ఖుల్నా, కోల్కతా మధ్య రైలు రాకపోకలను, బస్సు సర్వీసులనూ శనివారం ప్రారంభించనున్నారు. తీస్తా ఒప్పందాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగ వ్యతిరేకిస్తున్నందున ఆమె అంగీకారం తెలిపాకే దీనిపై ముందుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







