దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్
- April 07, 2017
మనామా: వరల్డ్ జ్యుయెలర్స్ అధిపతి రజనీకాంత్ ఫిచ్చాదియాపై దాడి చేసి, అతన్నుంచి 13,000 బహ్రెయినీ దినార్స్ విలువైన బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ ఈ కేసును ఛేదించింది. అరెస్టు చేసిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. మార్చి 28వ తేదీన ఈ దొంగతనం జరిగింది. నలుగురు దుండగులు, జ్యుయెలరీ షోరూం వద్ద నిలుచుని ఉన్న రజనీకాంత్పై దాడి చేశారు. బంగారాన్ని దొంగిలించిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల అరెస్ట్పై తనకు అధికారుల నుంచి సమాచారం అందిందనీ, ఈ కేసులో నిందితుల్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రజనీకాంత్ అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









