దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్
- April 07, 2017
మనామా: వరల్డ్ జ్యుయెలర్స్ అధిపతి రజనీకాంత్ ఫిచ్చాదియాపై దాడి చేసి, అతన్నుంచి 13,000 బహ్రెయినీ దినార్స్ విలువైన బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ ఈ కేసును ఛేదించింది. అరెస్టు చేసిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. మార్చి 28వ తేదీన ఈ దొంగతనం జరిగింది. నలుగురు దుండగులు, జ్యుయెలరీ షోరూం వద్ద నిలుచుని ఉన్న రజనీకాంత్పై దాడి చేశారు. బంగారాన్ని దొంగిలించిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల అరెస్ట్పై తనకు అధికారుల నుంచి సమాచారం అందిందనీ, ఈ కేసులో నిందితుల్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రజనీకాంత్ అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







