దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్‌

- April 07, 2017 , by Maagulf
దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్‌

మనామా: వరల్డ్‌ జ్యుయెలర్స్‌ అధిపతి రజనీకాంత్‌ ఫిచ్చాదియాపై దాడి చేసి, అతన్నుంచి 13,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ మరియు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఈ కేసును ఛేదించింది. అరెస్టు చేసిన నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. మార్చి 28వ తేదీన ఈ దొంగతనం జరిగింది. నలుగురు దుండగులు, జ్యుయెలరీ షోరూం వద్ద నిలుచుని ఉన్న రజనీకాంత్‌పై దాడి చేశారు. బంగారాన్ని దొంగిలించిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల అరెస్ట్‌పై తనకు అధికారుల నుంచి సమాచారం అందిందనీ, ఈ కేసులో నిందితుల్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు డిపార్ట్‌మెంట్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రజనీకాంత్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com