సౌదీ ఖర్జూర ఎగుమతుల్లో 37 శాతం వృద్ధి

- April 07, 2017 , by Maagulf
సౌదీ ఖర్జూర ఎగుమతుల్లో 37 శాతం వృద్ధి

మదీనా: ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి 2016 తొలి 11 నెలల్లో 37 శాతం వృద్ధిని సౌదీ నమోదు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో ఇదే కాలానికి 66,000 టన్నుల ఖర్జూరం ఎగుమతిని చేయగా, 2016లో 90,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేశారు. మదీనా రీజియన్‌ నుంచి 2016లో మొత్తం 20,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 9 మిలియన్‌ యాత్రీకులు తమతోపాటు 45,000 టన్నుల ఖర్జూరాన్ని గత ఏడాది తీసుకెళ్ళారు. ఖర్జూరం ట్రేడర్‌ సుల్తాన్‌ సలెహెమ్‌ మాట్లాడుతూ, కార్మికులు దొరక్క, డేట్‌ ఫెస్టివల్స్‌ సరిగ్గా జరగక ఈ రంగంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com