ఖతార్ ఎయిర్ వేస్లో ల్యాప్టాప్ సౌకర్యం
- April 08, 2017
ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళే విమానాల్లో ఆన్ బోర్డ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ల్యాప్టాప్లను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంప్లిమెంటరీ ల్యాప్టాప్లు ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు లభిస్తాయనీ, వీటిని బోర్డింగ్ గేట్ వద్ద ప్రయాణీకులు కలెక్ట్ చేసుకోవచ్చని ఖతార్ ఎయిర్ వేస్ వర్గాలు తెలిపాయి. ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తున్న సమయంలో వర్క్ చేసుకోవడం ఎంత అవసరమో తాము గుర్తించామనీ, అందుకే ఈ ఆన్ బోర్డ్ ల్యాప్ టాప్ సౌకర్యం కల్పిస్తున్నామని ఖతార్ ఎయిర్ వేస్ గ్రూప్ సిఇఓ అక్బర్ అల్ బకర్ చెప్పారు. మార్చి నెలలో యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) అధ్యక్షుడు, ఆన్బోర్డ్ ల్యాప్ టాప్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్లకు మించి ఎలాంటి గ్యాడ్జెట్స్నీ ఆన్బోర్డ్ అనుమతివ్వడంలేదు. 10 దేశాలకు చెందిన ఎయిర్పోర్ట్ల నుంచి (యూఏఈ, ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా మరియు కువైట్ తదితర దేశాలు) వచ్చే విమానాలపై ఈ నిషేధం ఉంది. ఇంకో వైపున ఎతిహాద్ ఎయిర్వేస్, ఉచిత వైఫై మరియు ఐపాడ్స్ సర్వీస్లను ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







