పశ్చిమ మయన్మార్‌లో పెళ్లి పడవ మునిగి 20 మంది మృతి

- April 08, 2017 , by Maagulf
పశ్చిమ మయన్మార్‌లో పెళ్లి పడవ మునిగి 20 మంది మృతి

పెళ్లి పడవ నది వంతెనను ఢీకొట్టడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమ మయన్మార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 మంది ప్రయాణిస్తున్న ‘సిల్వర్‌ స్టార్‌’ అనే పడవ పథేన్‌ దగ్గరలోని నది వంతెనను శుక్రవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 16 మంది మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. కనీసం తొమ్మిది మంది గల్లంతయ్యి ఉంటారని, 30 మందిని రక్షించామని స్థానిక ఎంపీ ఆంగ్‌ తు హెట్వే తెలిపారు.
మయన్మార్‌లో పడవ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబరులో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన పడవ అధిక లోడ్‌ కారణంగా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో 73 మంది మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com