పశ్చిమ మయన్మార్లో పెళ్లి పడవ మునిగి 20 మంది మృతి
- April 08, 2017
పెళ్లి పడవ నది వంతెనను ఢీకొట్టడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమ మయన్మార్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 మంది ప్రయాణిస్తున్న ‘సిల్వర్ స్టార్’ అనే పడవ పథేన్ దగ్గరలోని నది వంతెనను శుక్రవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 16 మంది మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. కనీసం తొమ్మిది మంది గల్లంతయ్యి ఉంటారని, 30 మందిని రక్షించామని స్థానిక ఎంపీ ఆంగ్ తు హెట్వే తెలిపారు.
మయన్మార్లో పడవ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబరులో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన పడవ అధిక లోడ్ కారణంగా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో 73 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







