పృధ్వి సంచలనం కామెంట్స్ హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్పింది
- April 10, 2017
కాస్టింగ్ కౌచ్....అంశం ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొందరు హీరోయిన్లు ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను నిర్మొహమాటంగా బయట పెడుతున్నారు. తమతో పడుకుంటేనే అవకాశాలు, సెక్స్ సుఖం అందిస్తేనే చాన్సులు ఇస్తామని చెప్పే దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారని సంచలన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలపై 30 ఇయర్స్ పృధ్వి ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తనదైన రీతిలో స్పందించారు. ఇంటర్వ్యూల్లో ఇలాంటి విషయాలు బయట పెడుతున్న వారిని తనదైన రీతిలో ఏకి పారేసారు.
'ఇండస్ట్రీలో బ్రతుకుతున్నారు మీరు. ఇండస్ట్రీ ఇచ్చే డబ్బులే తింటున్నారు.... ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా ప్రజల్లో మన చలన చిత్ర రంగం, టీవీ రంగం అంటే చాలా చులకన భావం ఏర్పడేలా చేస్తున్నారు. అలా చేస్తున్న వారికి హేమగారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు' అని పృధ్వి అభినందించారు.
నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, సహనటులు, దర్శకుల గురించి ఇలా ఏది పడితే అలా మాట్లాడటం చాలా దారుణం అని పృధ్వి అన్నారు. ఒకావిడ ఓ డైరెక్టర్, ఓ ప్రొడ్యూసర్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని అని స్టేట్మెంట్ ఇస్తుంది. మరొకావిడి నాతో ఒకరు పడుకున్నారని అంటుంది. ఒకావిడ తనను పాడు చేసారని అంటుంది, ఇంకో ఆవిడ అర్దరాత్రి వచ్చి తలుపు కొట్టాడని అంటుంది, తండ్రి లాంటోడు కూతురు లాంటి తనకు కడుపు చేసాడని ఒకరు అంటారు.... స్త్రీ సహకారం లేనిదే ఏది జరుగదు, వీరి సహకారం లేకుండా ఇవన్నీ జరుగాయంటే నేను నమ్మను. ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఉన్నారే అనుకుందాం....వారు పిలిచినపుడు నువ్వు ఎందుకు వెళ్లాలి? నువ్వు పిలిచావు కాబట్టే వచ్చి నీ తలుపు కొట్టాడు అంటూ..... కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వారిపై పృధ్వి విరుచుకుపడ్డారు.
ఇప్పుడైతే ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతి లేదు. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్ వచ్చారు. అందరూ సంస్కార వంతులే ఉన్నారు....ఇష్టమైతే యాక్టర్ చేయాలి, లేకుంటే లేదు కానీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు పృధ్వి.
ఈ మధ్య ఇంటర్వ్యూ చేసే వారు ప్రిపేర్ చేసే ప్రశ్నలు కూడా అలానే ఉన్నాయి. కావాలనే వారి పర్సనల్ లైఫ్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. వారు అలా అడుగుతున్నారు కాబట్టే హీరోయిన్లు నుండి అలాంటి సమాధానాలు వస్తున్నాయి. ఇవేవో సమరంగారి ఇంటర్వ్యూల్లా ఉన్నాయి అని పృధ్వి అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







