సౌదీ ఎడారిలో మృత్యువాత: తెలుగువ్యక్తి దీనగాధ
- April 10, 2017
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోగల మెదక్ జిల్లాకి చెందిన మన్నెల రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో హృదయ విదారక స్థితిలో మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ అతను మృతి చెందిన రెండేళ్ళ తర్వాత అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాములు చనిపోయిన తర్వాత 8 నెలలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్ళిన రాములు, కొన్ని కారణాలతో అనుకున్న ఉద్యోగం కాకుండా పశువుల కాపరిగా పనిచేయాల్సి వచ్చింది. ఎడారిలో పశువులను కాస్తుండగా తీవ్రమైన డీహైడ్రేషన్తో అక్కడే కుప్పకూలిపోయాడు. 2016 ఫిబ్రవరి 1న మరో ఆఫ్రికాకి చెందిన మరో పశువుల కాపరి, రాములు మృతదేహాన్ని గుర్తించాడు. అప్పటికే రాములు మృతదేహం చాలావరకు డీ కంపోజ్ అయిపోయింది. ఆఫ్రికా పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విచారణ చేపట్టి మృతుడిని గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే రాములు కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. రాములు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు వారు చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో చివరికి, అక్కడే బురైదాలో రాములు మృతదేహాన్ని ఖననం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







