నైగర్‌లో 57 మంది ఉగ్రవాదులు హతం

- April 10, 2017 , by Maagulf
నైగర్‌లో 57 మంది ఉగ్రవాదులు హతం

నైగర్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ బోకోహారమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఓ గ్రామంపై దాడి చేసిన 57 మంది ఉగ్రవాదులను నైగర్‌ సైన్యం మట్టుబెట్టింది.
డిఫా ప్రాంతంలోని గుయెస్కెరొ గ్రామంపై దాడిచేసిన బోకోహారమ్‌ ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని నైగర్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో 15 మంది సైనికులతో పాటు.. ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ సంఖ్యలో ఏకే 47 తుపాకులు, రాకెట్‌ లాంచర్‌లను సైన్యం స‍్వాధీనం చేసుకుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com