కేరళ పాఠశాలల్లో ఇక మలయాళం బాష తప్పనిసరి

- April 11, 2017 , by Maagulf
కేరళ పాఠశాలల్లో ఇక మలయాళం బాష తప్పనిసరి

కేరళలోని అన్ని పాఠశాలల్లో మలయాళం భాష బోధన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ సదాశివం సంతకం చేశారు. దీని ప్రకారం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో మలయాళం తప్పనిసరిగా బోధించాల్సిందే. హైయర్‌ సెకండరీ క్లాసుల వరకు మలయాళం కచ్చితంగా బోధించేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో వెల్లడించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. నిబంధనలు పాటించని పాఠశాలలు, ఉపాధ్యాయులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో అసలు మలయాళం బోధించడం లేదని తెలుసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com