కేరళ పాఠశాలల్లో ఇక మలయాళం బాష తప్పనిసరి
- April 11, 2017
కేరళలోని అన్ని పాఠశాలల్లో మలయాళం భాష బోధన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్పై ఈరోజు రాష్ట్ర గవర్నర్ సదాశివం సంతకం చేశారు. దీని ప్రకారం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో మలయాళం తప్పనిసరిగా బోధించాల్సిందే. హైయర్ సెకండరీ క్లాసుల వరకు మలయాళం కచ్చితంగా బోధించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో వెల్లడించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నిబంధనలు పాటించని పాఠశాలలు, ఉపాధ్యాయులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో అసలు మలయాళం బోధించడం లేదని తెలుసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







