బాలయ్యకు పదిలక్షలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
- April 11, 2017
తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా వెలిగిపోయిన నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయిని రూమర్లు వచ్చాయి. అయితే వీటిని ఎన్టీఆర్ ఖండించారు..బాబాయి అంటే తనకు ఎంతో గౌరవం అని ఆయన గొప్ప నటులు అని ఖితాబు ఇచ్చారు. తాజాగా బాబాయికి అబ్బాయి పదిలక్షలు డొనేట్ చేసి మరోసారి తమ మద్య ఎలాంటి ఆంతర్యాలు లేవని చాటి చెప్పారు.
అసలు విషయానికి వస్తే..గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. అయితే జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ వాడిన బైక్ ని ఆక్షన్ కు పెట్టారు. ఆ బుల్లెట్ను తారక్కు వీరాభిమాని అయిన రాజ్కుమార్ రెడ్డి అనే వ్యక్తి రూ.10 లక్షలకు వేలంలో దక్కించుకున్నాడు. అయితే.. ఆ మొత్తాన్ని బాలకృష్ణ నిర్వహించే బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి విరాళంగా అందజేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
అన్న మాట ప్రకారం ఆ పదిలక్షలు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి కి విరాళంగా ఇచ్చారు మైత్రి మూవీస్ అధినేతలు . బాలయ్య ని స్వయంగా కలిసిన వాళ్ళ లో జనతా గ్యారేజ్ చిత్ర నిర్మాతలతో పాటు దర్శకులు కొరటాల శివ కూడా ఉన్నారు. అయితే చెక్కును అందించేందుకు తారక్ను కూడా కొరటాల, నిర్మాతలు ఆహ్వానించినా.. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రాలేనని చెప్పాడట.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ బసవరమతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే . క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలందిస్తున్న బసవతారకం ఆసుపత్రి కి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







