మోదీ మెచ్చిన ‘దీవార్’ సినిమా పోస్టర్
- April 12, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పోస్టర్ల రూపంలో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, శశికపూర్, నిరూపా రాయ్ నటించిన ‘దీవార్’ సినిమా పోస్టర్పై స్వచ్ఛ భారత్ గురించి వివరిస్తూ రాసిన డైలాగ్ వైరల్గా మారింది. ఆ సినిమాలో నటి నిరూపా రాయ్.. అమితాబ్, శశికి తల్లిగా నటించింది. ఈ కథలో కొడుకులిద్దరూ తల్లి ఎవరితో ఉండాలన్న దానిపై గొడవపడుతుంటారు. అయితే ఈ కథనే స్వచ్ఛ భారత్ సారాంశంగా మారుస్తూ.. పోస్టర్పై ఓ డైలాగ్ రాశారు. ఓ పక్క తల్లి తనతోనే ఉండాలని అమితాబ్, కాదు తనతోనే ఉండాలని శశికపూర్ అంటుంటారు. కానీ నిరూపా మాత్రం ‘ఎవరైతే ముందు మరుగుదొడ్డి కట్టిస్తారో వారితోనే ఉంటాను’ అంటుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కోసం ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఈ పోస్టర్ను పెట్టారు. దీనిని సాహు అనే నెటిజన్ మోదీకి ట్వీట్ చేశాడు. దీనిని మోదీ రీట్వీట్ చేస్తూ.. ‘హా హా..
పరిశుభ్రత గురించి చెప్పడానికి సినిమా పోస్టర్ని వాడుకున్నారు. వినూత్నమైన ఆలోచన’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









