మరో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టనున్న సూపర్ స్టార్ మహేష్
- April 12, 2017
అలనాటి నటీనటులకు ముంచు చూపు లేక చివరి స్టేజ్ లో ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు అని చదువుతూనే ఉన్నాం.. కానీ ఇటీవల నటీనటులు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ముందు చూపుతో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టి ఆర్ధిక భరోసాను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఇప్పటికే రకుల్, తమన్నా, తాప్సీ, ప్రణీత వంటి వారు బిజినెస్ రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అందుకొన్నారు.. ఇక నాగార్జున సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్న సంగతి విధితమే.. ఇక యంగ్ హీరో రామ్ చరణ్ కూడా వివిధ బిజినెస్ ల్లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అందుకొన్నాడు.. నితిన్, శర్వానంద్ వంటి వరుకూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారు.. కాగా సూపర్ స్టార్ మహేష్ కూడా నటన తో పాటు నిర్మాతగా మారాడు.. నిర్మాతగా సక్సెస్ అందుకొన్న మహేష్ మరో కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం.. ఏషియన్ థియేటర్స్ కు చెందిన సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ బాబు బిజినెస్ రంగంలోకి దిగనున్నట్లు ఈ మేరకు మహేష్ బాబు చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదటి దశలో తెలుగు రాష్ట్రాల్లో 25 థియేటర్స్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తునట్లు టాక్ ..
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







