వృద్ధదంపతుల కోసం ఇతిహాద్ విమానం దింపారు
- April 16, 2017
ఒక్కసారి విమానం టేకాఫ్ అయ్యాక మళ్లీ ల్యాండ్ అయ్యేది గమ్యస్థానంలోనే. మధ్యలో ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే తప్ప వారి వ్యక్తిగత సమస్యల కోసం విమానాన్ని వెనక్కి తిప్పడం, ఆలస్యంగా బయలుదేరడం లాంటిది ఉండదు. కానీ ఎతిహాద్ ఎయిర్వేస్కి చెందిన ఓ విమానం వృద్ధ దంపతుల కోసం చేసిన సాయానికి ఇప్పుడంతా ఎతిహాద్ సంస్థని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. ఎతిహాద్ ఎయిర్వేస్కి చెందిన ఓ విమానం మాంచెస్టర్ నుంచి అబుదాబికి వెళ్లాల్సి ఉంది. విమానం మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన సెకన్లకే దానిలో ప్రయాణిస్తున్న వృద్ధదంపతులకు వారి మనవడి పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే వారు విమాన సిబ్బందికి చెప్పి మనవడిని చూడాలనుంది అంటూ కన్నీరుపెట్టుకున్నారు.
వారి బాధ అర్థంచేసుకున్న సిబ్బంది ఈ విషయాన్ని పైలట్కి చెప్పడంతోటాకాఫ్ అయిన విమానాన్ని వెనక్కి మళ్లించాడు. వారి కోసం నిబంధనలకు వ్యతిరేకంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆపడమే కాకుండా వారు వెంటనే ఇంటికి చేరుకోవడానికి దగ్గరుండి క్యాబ్ ఏర్పాటుచేసి లగేజ్ పెట్టించి మరీ అబుదాబికి బయలుదేరారు. అంతేకాదు ఎతిహాద్ సంస్థ వారి టికెట్ క్యాన్సిల్ చేయ్యకుండా ఎప్పటికైనా వాడుకునే అవకాశం కూడా కల్పించింది. కానీ వారు మనవడిని చూసుకోవడానికి వెళ్లిన మరుసటి రోజే అతను చనిపోవడం బాధాకరం.
ఈ విషయాన్ని హిందీ బుల్లితెర నటుడు కుషాల్ టాండన్ తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఎతిహాద్ అంటే కలిసుండడం అని అర్థం అంటూ ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









