హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లలో కుళ్లిన మాంసం
- April 19, 2017
నగరంలోని పలు హోటళ్లను జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లలో తనిఖీలు చేసి భారీగా జరిమానా విధించారు. పాచిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన దిల్సుఖ్నగర్లోని శివాని హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్ నుంచి చెడిపోయిన ఆహారపదార్థాలను, కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వంటగది అపరిశుబ్రంగా ఉండడంతో దిల్సుఖ్నగర్లోని గ్రీన్ బావర్చి హోటల్, శిల్పి హోటళ్లకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. అదే విధంగా హోటల్ బృందావనంలో తనిఖీలు చేపట్టి పాడైన పదార్థాలను గుర్తించారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. జీహెచ్ఎంసీకి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్, వెటర్నరీ డాక్టర్, ప్రజారోగ్య శాఖ అధికారి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









