హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లలో కుళ్లిన మాంసం
- April 19, 2017
నగరంలోని పలు హోటళ్లను జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లలో తనిఖీలు చేసి భారీగా జరిమానా విధించారు. పాచిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన దిల్సుఖ్నగర్లోని శివాని హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్ నుంచి చెడిపోయిన ఆహారపదార్థాలను, కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వంటగది అపరిశుబ్రంగా ఉండడంతో దిల్సుఖ్నగర్లోని గ్రీన్ బావర్చి హోటల్, శిల్పి హోటళ్లకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. అదే విధంగా హోటల్ బృందావనంలో తనిఖీలు చేపట్టి పాడైన పదార్థాలను గుర్తించారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. జీహెచ్ఎంసీకి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్, వెటర్నరీ డాక్టర్, ప్రజారోగ్య శాఖ అధికారి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







