దుబాయ్ రానున్న బాహుబలి టీం
- April 21, 2017
‘బాహుబలి’ చిత్ర బృందం ప్రచార కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడి సిటీ వాక్లోని రాక్సీ సినిమాస్లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క పాల్గొననున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలి సినిమా తెరవెనుక చేసే అద్భుతాల గురించి చూపించబోతున్నామని రోక్సీ సినిమాస్ ప్రతినిధులు తెలిపారు.
బాహుబలి చిత్రం బృందం దుబాయ్ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని డీసీటీసీఎం(దుబాయ్ కార్పొరేషన్ ఫర్టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) సీఈవో ఇస్సాం కాజిమ్ తెలిపారు. ఇలాంటి సినిమాలు దుబాయ్లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో 2020 నాటికి పర్యటకుల సంఖ్య 20 మిలియన్లకు చేరాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి-ది కన్క్లూజన్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.
గల్ఫ్ లో ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దుబాయ్ మను తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







