దుబాయ్ రానున్న బాహుబలి టీం
- April 21, 2017
‘బాహుబలి’ చిత్ర బృందం ప్రచార కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడి సిటీ వాక్లోని రాక్సీ సినిమాస్లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క పాల్గొననున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలి సినిమా తెరవెనుక చేసే అద్భుతాల గురించి చూపించబోతున్నామని రోక్సీ సినిమాస్ ప్రతినిధులు తెలిపారు.
బాహుబలి చిత్రం బృందం దుబాయ్ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని డీసీటీసీఎం(దుబాయ్ కార్పొరేషన్ ఫర్టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) సీఈవో ఇస్సాం కాజిమ్ తెలిపారు. ఇలాంటి సినిమాలు దుబాయ్లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో 2020 నాటికి పర్యటకుల సంఖ్య 20 మిలియన్లకు చేరాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి-ది కన్క్లూజన్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.
గల్ఫ్ లో ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దుబాయ్ మను తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









