ముంబై ఫై ఆత్మాహుతి దాడులు చేస్తానంటున్న అరీబ్ మజీద్
- October 03, 2015
ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద ఆత్మాహుతి దాడులు చేస్తానంటూ సిరియా నుంచి తిరిగొచ్చిన అరీబ్ మజీద్ అనే యువకుడు ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఆ యువకుడు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. మజీద్ స్నేహితుడు ఫహీద్ షేక్ కూడా అతడితో కలిసి గత సంవత్సరం సిరియా వెళ్లిపోయాడు. అతడు కూడా ఐఎస్ఐఎస్ లో చేరేందుకే వెళ్లినట్లు సమాచారం. ఫహీద్ షేకే ఈ ట్విట్టర్ ఖాతాను నిర్వహించేవాడని అంటున్నారు. మజీద్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాడో తెలుసుకోండి.. అంటూ ట్వీట్లు మొదలయ్యాయి. అరీబ్ మజీద్ సోదరిని భారతీయ పోలీసులు తీవ్రంగా అవమానించారని, అందుకే వాళ్లమీద ప్రతీకారం తీర్చుకోడానికి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసేందుకు అతడు వస్తున్నాడని చెప్పారు. ఐఎస్ఐఎస్ లో మజీద్ సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని కూడా ఆ ట్వీట్ లో అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









