వాట్సాప్ అడ్మిన్లూ.. జర జాగ్రత్త!
- April 23, 2017
వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అయినవారిని వారణాసిలోని ఉన్నతాధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెడితే.. సంబంధిత సోషల్ మీడియా గ్రూప్కు చెందిన అడ్మినిస్ట్రేటరే అందుకు బాధ్యలవుతారని అక్కడి జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) యోగేశ్వర్ రామ్మిశ్రా, ఎస్పీ నితిన్ తివారి వార్నింగ్ ఇస్తున్నారు. ఈమేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీచేశారు.
గ్రూపులో మతపరమైన విద్వేషాలకు దారితీసే కంటెంట్గానీ, తప్పుడు సమాచారంగానీ ఉన్న పక్షంలో సంబంధిత సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని, జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుందని ప్రకటించారు. తప్పుడు సమాచారం లేదా కల్పిత (మార్ఫ్ చేసిన) ఫోటోలను, ఒకరి ప్రతిష్టకు భంగం కల్పించే వీడియోల పోస్టింగులను నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ వారు పేర్కొన్నారు. గ్రూప్పై పోస్ట్ చేసే కంటెంట్కి అడ్మిన్లే బాధ్యులని స్పష్టం చేశారు. అయితే.. తమ గ్రూపుల్లో పోస్ట్ చేసే సమాచారానికి, వాట్సాప్ అడ్మిన్లు బాధ్యలు కారని గత ఏడాది ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







