పిక్చర్ పెర్ఫెక్ట్ దోహా
- October 03, 2015
వాతావరణం కాస్త చల్లబడటంతో దోహాలో పర్యాటక స్థలాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అందమైన దృశ్యాల్ని బంధించేందుకు ఫొటోగ్రాఫర్లూ పోటీపడుతున్నారు. సోషల్ మీడియాలో దోహా అందాల్ని ఔత్సాహికులు పొందుపర్చుతున్నారు. ఖతార్ టూరిజం అథారిటీ కూడా దోహా సహా, ఖతార్లోని అందమైన ప్రాంతాల్ని ఇంకా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఖతార్, దోహా అందాల్ని ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ప్రపంచ వ్యాపితంగా పర్యాటకులు ఈ అందాల్ని తిలకించడానికి మక్కువ చూపుతారని పేరొందిన ఫొటోగ్రాఫర్లు చెప్పారు. అక్టోబర్ 3న 50 మంది ఖతార్కి చెందిన ఫొటోగ్రాఫర్లతో వరల్డ్వైడ్ ఫొటో వాక్ని నిర్వహిస్తున్నారు. క్యాచెస్ ఆఫ్ లైట్-ఖతర్, డిపిఎస్సి, వెబ్ అలయన్స్ ఆఫ్ రాడికల్ ఫొటోగ్రాఫర్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఫొటోగ్రాఫర్లందరికీ ఉచితంగానే 'రన్'లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఉదయం 5.30 నిమిషాల నుండి 8 గంటలవరకు పెరల్ మాన్యుమెంట్ ఎంఐఏ పార్క్ వరకు రన్ జరిగింది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







