పిక్చర్ పెర్ఫెక్ట్ దోహా
- October 03, 2015
వాతావరణం కాస్త చల్లబడటంతో దోహాలో పర్యాటక స్థలాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అందమైన దృశ్యాల్ని బంధించేందుకు ఫొటోగ్రాఫర్లూ పోటీపడుతున్నారు. సోషల్ మీడియాలో దోహా అందాల్ని ఔత్సాహికులు పొందుపర్చుతున్నారు. ఖతార్ టూరిజం అథారిటీ కూడా దోహా సహా, ఖతార్లోని అందమైన ప్రాంతాల్ని ఇంకా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఖతార్, దోహా అందాల్ని ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ప్రపంచ వ్యాపితంగా పర్యాటకులు ఈ అందాల్ని తిలకించడానికి మక్కువ చూపుతారని పేరొందిన ఫొటోగ్రాఫర్లు చెప్పారు. అక్టోబర్ 3న 50 మంది ఖతార్కి చెందిన ఫొటోగ్రాఫర్లతో వరల్డ్వైడ్ ఫొటో వాక్ని నిర్వహిస్తున్నారు. క్యాచెస్ ఆఫ్ లైట్-ఖతర్, డిపిఎస్సి, వెబ్ అలయన్స్ ఆఫ్ రాడికల్ ఫొటోగ్రాఫర్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఫొటోగ్రాఫర్లందరికీ ఉచితంగానే 'రన్'లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఉదయం 5.30 నిమిషాల నుండి 8 గంటలవరకు పెరల్ మాన్యుమెంట్ ఎంఐఏ పార్క్ వరకు రన్ జరిగింది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







